ప్రస్తుతం బుల్లితెరపై టాప్ కామెడీ షోగా కొనసాగుతోంది టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం. ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫేవరెట్ షో గానే కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నా జబర్దస్త్ చూసి కాసేపు హాయిగా నవ్వుకుని ఉపశమనం పొందుతూ ఉంటారు. అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న ఎంతో మంది కమెడియన్స్ కి కూడా మంచి అవకాశం వచ్చింది అని చెప్పాలి.



 ఇప్పటికే జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కొత్త కమెడియన్స్ అవకాశాలు దక్కించుకుని ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ లో ఎప్పటికప్పుడు ఒక కొత్త జంట హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల జబర్దస్త్ లో బాగా క్రేజ్ సంపాదించిన జంట వర్ష ఇమాన్యుయేల్ అనే చెప్పాలి. ఇక వీరిద్దరికీ జబర్దస్త్ జడ్జి రోజా బ్లాక్ అండ్ వైట్ జోడీ అంటూ ఒక నిక్ నేమ్ కూడా పెట్టడం గమనార్హం.  ఇక ప్రస్తుతం జబర్దస్త్ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో కూడా ఈ ఇద్దరి జోడి ఎప్పుడూ  సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది.



 అంతేకాదు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ తోనే ఈటీవీ నిర్వాహకులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఇకపోతే అటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో కూడా వీరిద్దరూ ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నేటి రోజుల్లో ఎంతోమంది యువకులు ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయాన్ని  కళ్లకు కట్టినట్లుగా వర్ష, ఇమ్మానియేల్ తమ పర్ఫామెన్స్ లో చూపించారు.  ఇక ఈ పర్ఫామెన్స్ అందరికీ కనెక్ట్ అయింది అని చెప్పాలి. తర్వాత స్పందించిన రాంప్రసాద్ ప్రేమించిన తర్వాత పెద్దలను ఒప్పించండి.. ఒప్పుకోకపోతే వేరే పెళ్లి చేసుకోండి కానీ ఇలా చనిపోకండి.. ఎందుకంటే జీవితం ఎంతో విలువైనది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sdc