ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రఖ్యాత లు పొందుతుంది. ఎందుకంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వచ్చిన మంచి మంచి కథలు ఏ భాషలోనూ రావడం లేదు. అక్కడి నటు లు కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. దేశంలోని సినిమా పరిశ్రమల్లో బాలీవుడ్ సినిమా పరిశ్రమ మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది కానీ ఎప్పుడైతే టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమా విడుదలైందో అప్పటినుంచి తెలుగు సినిమా పరిశ్రమ టైం మొదలైంది అని చెప్పవచ్చు.

ఆ తర్వాత ఎన్నో సినిమాలు బాలీవుడ్ ని తలదన్నే రేంజిలో వచ్చాయి. వాటి ముందు బాలీవుడ్ సినిమాలు సైతం చిన్నబోయెలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొన్ని సినిమాలు తమ సత్తా చాటడానికి టాలీవుడ్లో సిద్ధమవుతున్నాయి. పుష్ప, ఆచార్య, లైగర్, rrr ఇలా మరికొన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ గా విడుదల అవుతూ అందరిని మెప్పించడానికి సిద్ధం అవుతున్నాయి.  ఇదిలా ఉంటే టాలీవుడ్ లోని ప్రతిభను గమనించిన కొంతమంది కోలీవుడ్ హీరో లు దర్శకులతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

ఇటీవలే ధనుష్ మరియు విజయ్ దళపతి తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా కోలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులపై అమితమైన ప్రేమ చూపిస్తుంటే మాత్రం తక్కువ తిన్నామా అని చెప్పి బాలీవుడ్ హీరో లు కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా ను అదే దర్శకుడితో షాహిద్ కపూర్ చేశాడు. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి తో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు.అంతేకాదు మరికొన్ని తెలుగు సినిమాలను కూడా అయన రీమేక్ చేసే విధంగా పోతున్నాడు. షాహిద్ కపూర్ మాత్రమే కాకుండా మిగతా హీరోలు కూడా తెలుగు దర్శకుల సినిమాలు చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: