పంజాబీ చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో "వెంకటాద్రి ఎక్స్ప్రెస్" చిత్రంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే తన గ్లామర్, అభినయంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోలను సరసన హీరోయిన్ గా ఛాన్స్ లను దక్కించుకుంది. దాదాపుగా పదేళ్లకు పైగా సినీ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ఈ మధ్య తెలుగులో కాస్త జోరు తగ్గించింది అని చెప్పాలి. ఇక్కడ కాస్త అవకాశాలు సన్నగిల్లాయి అనే చెప్పాలి. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస చిత్రాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

కాగా ప్రస్తుతం మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి మంచి జోరు మీదున్న మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ సరసన నటిస్తోంది. ఉప్పెన సినిమాతో బాక్స్ ఆఫిస్ వద్ద సునామీ సృష్టించిన మెగా హీరో వైష్ణవి తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రం  కొండపొలం ఈ చిత్రంలో రకుల్ డి గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు. అయితే రకుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇపుడు తెలుసుకుందాం. 2009 లో గిల్లి అనే కన్నడ చిత్రంతో తన కెరియర్ ని మొదలు పెట్టిన రకుల్ ఇటు తెలుగు అటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది.  ఈమె సినిమాల్లోకి రాకముందు మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొన్నారు.  

మిస్ టాలెంటడ్, మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఐస్,  టైటిళ్లనూ సొంతం చేసుకున్నారు. ఈమె గొప్ప నటి మాత్రమే కాదు మంచి టెన్నిస్ మరియు గోల్ఫ్ క్రీడాకారిణి కూడా. పలు  టోర్నమెంట్లు ను కూడా గెలుచుకున్నారు. అంతేకాదు కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాధించారు రకుల్. ఈమె   గుర్రపుస్వారీ కూడా బాగా చేస్తారు. భరతనాట్యం కూడా అద్భుతంగా చేస్తారు రకుల్ ప్రీత్ సింగ్. ఈమెకు శీతాకాలం అంటే అస్సలు ఇష్టం ఉండదట. టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా హీరోయిన్ గా కొనసాగుతూ తనదైన ముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: