టాలీవుడ్ లో మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కు ఇప్పుడు డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే కీర్తి సురేష్ చేస్తున్న పాత్రలు 1, 2 మాత్రమే కాకుండా ఇతర పాత్రల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఈ విషయంలో టాలీవుడ్ నిర్మాతలు కూడా పెద్దగా భయపడటం లేదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కీర్తి సురేష్ ఇప్పుడు నిబంధనలు ఎక్కువగా పెడుతుంది అంటున్నారు.

 తమిళంలో అలాగే మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగులో కేవలం పది రోజులు మాత్రమే నెలకు షూటింగులో పాల్గొనే విషయాన్ని ఆమె కొంత మంది నిర్మాతల వద్ద స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ లో కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక మందన మినహా పెద్దగా టాలీవుడ్ లో సినిమాలు చేసే హీరోయిన్లు కనబడటంలేదు. సీనియర్ హీరోయిన్లు సమంత ,అనుష్క సినిమాలకు దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. సమంత ఇతర భాషల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.

కాబట్టి ఇప్పుడు తెలుగులో వీళ్ళ ముగ్గురు ఉన్న నేపథ్యంలో వీళ్లను కాస్త జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం టాలీవుడ్ వర్గాలు చేస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో అలాగే ఇంకో హీరోతో సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ త్వరలోనే కన్నడ సినిమాలో కూడా కనపడనుంది. ఏది ఎలా ఉన్నా సరే కీర్తి సురేష్ డిమాండ్లకు టాలీవుడ్ లో దాదాపు గా ఓకే చెప్తున్నారు. ఆమె చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా  వైరల్ అయింది. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగు సినిమాలు అన్ని కూడా అగ్రహీరోలతో నే ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: