మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన లూసిఫ‌ర్ అనే సినిమాను తెలుగు గాడ్ ఫాద‌ర్ గా చిరింజీవి హీరోగా రిమెక్ చేస్తున్న విష‌యం తెలిసింది. ఇటివ‌లే మెగ‌స్టార్ చిరంజీవి కూడా ఆచార్య సినిమా షూటింగ్ ను విజ‌య వంతంగా పూర్తి చేస‌కుని గాడ్ ఫాద‌ద్ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా కు సంబంధించిన మొద‌టి షెడ్యుల్ కోసం చిరంజీవి, చిత్ర యూనిట్ ఇటీవ‌లే ఊటీ కి వెళ్లారు. ఈ సినిమా కు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అయితే క‌థ విష‌యం లో డైరెక్ట‌ర్‌ పూరి జ‌గ‌న్నాథ్ స‌ల‌హాలు ఇస్తున్నార‌ని తెలుస్తొంది. చిరంజీవి కి అనుకూలంగా క‌థ ఉండేలా పూరి చూస్తాడ‌ని తెలుస్తొంది. అలాగే ఈ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. అలాగే ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడుగా వ్య‌వ‌హ‌రించ నున్నాడు.



అయితే ఈ సినిమా కు సంబంధించిన ఒక స‌మాచారం టాలీవుడ్ లో షీకార్లు చేస్తుంది. ఈ సినిమా లో చిరంజీవి కి చెల్లెలి పాత్ర కు సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ పాత్ర కు బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాల‌న్  ను అనుకున్న‌ర‌ట‌. కానీ కొన్ని అనివార్య కార‌ణాల‌తో ర‌మ్యకృష్ణ ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అయితే గ‌తంలో హీరో హీరోయిన్ లుగా చేసిన చిరంజీవి ర‌మ్య కృష్ణ ఇప్పుడు అన్న చెల్లెలి పాత్ర లో క‌నిపించ బోతున్నారు. కాగ ర‌మ్యకృష్ణ బహుబ‌లి సినిమా త‌ర్వాత నుంచి భిన్న మైన క‌థ‌లను భిన్న మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటుంది. అలాగే బ‌హుబ‌లి సినిమాతో ర‌మ్య‌కృష్ణ దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అమె వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా వచ్చిన రిప‌బ్లిక్ అనే సినిమాలో కూడా ర‌మ్య‌కృష్ణ విశాఖ వాని అనే పాత్ర‌లో న‌టించింది. ఈ పాత్ర కు కూడా ర‌మ్య కృష్ణ కు మంచి గుర్తింపు వ‌చ్చింది.  




మరింత సమాచారం తెలుసుకోండి: