పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు పూర్తి కావడానికి వచ్చే ఏడాది పడుతుంది. అయితే ఈ మూడు సినిమాల తర్వాత మరో సినిమాని ఒప్పుకున్నాడని తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు చేసిన తర్వాత తర్వాతి సినిమాను చేద్దాంలే అని
ప్రభాస్ అనుకోవడంలేదు. తాజాగా అక్టోబరు 7వ తేదీన
ప్రభాస్ తన 25వ
సినిమా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ 25వ చిత్రం ఏది అనే చిన్న కన్ఫ్యూషన్ ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రభాస్ కెరీర్లో ల్యాండ్ మార్క్ చిత్రమైన 25వ చిత్రం ఇప్పుడు ప్రకటించబోతున్నట్లు వెళ్లడవుతుంది.
ఏ దర్శకుడి తో ఆ
సినిమా ఉంటుందో ఏ నిర్మాతలతో ఆ చిత్రం ఉంటుందో అన్నది సస్పెన్స్ గా మారింది ఇప్పుడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు ఆయన తదుపరి చిత్రాల పై గతంలో చాలా ఊహాగానాలు వచ్చాయి.
బాలీవుడ్ డైరెక్టర్ తో
సినిమా చేస్తున్నాడని,
కోలీవుడ్ డైరెక్టర్ తో
సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏది 25వ
సినిమా తెరకెక్కుతుంది అనేది కొంత కన్ఫ్యూజన్ లో ఉంది. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో
ప్రభాస్ వృందావన అనే సినిమాకు కమిట్ అయ్యాడు అని వార్తలు వచ్చాయి. ఆ
సినిమా 25వ
సినిమా గా ఖరారు చేశారని వార్తలు వినిపించాయి.
కానీ ఇంకొంతమంది
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ లో
ప్రభాస్ 25వ
సినిమా చేస్తున్నాడని చెప్పారు. దానికి
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు అని అన్నారు. కానీ దీనిలో కూడా ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. మరోవైపు
బాలీవుడ్ డైరెక్టర్
సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ తో ఓ
సినిమా చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చిత్రబృందం ఇవ్వలేదు. ఇంకోవైపు
ప్రభాస్ కరణ్ జోహార్ తో
సినిమా చేయబోతున్నాడని ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. అయితే వీటిలో ఏది ఖరారు అనేది ఇంతవరకు ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు ఈ 25 వ అప్డేట్ కోసం అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
బాహుబలి తర్వాత
రాజమౌళి తో మరొకసారి జతకట్టబోతున్నాడు అని
ప్రభాస్ తన 25వ ల్యాండ్ మార్క్ ఫిలిమ్ ఆయనతోనే చేయబోతున్నాడని ఇదే ఏడవ తేదీన రాబోయే అతి పెద్ద అప్డేట్ అని బల్ల గుద్ది చెబుతున్నారు ఆయన అభిమానులు. మరి ఏడవ తేదీన ఏం అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.