అక్కినేని నాగ చైతన్య, సమంత తొలిసారిగా కలిసి నటించిన సినిమామాయ చేసావే. వాస్తవానికి ఆ మూవీ ద్వారానే టాలీవుడ్ కి సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యారు. గౌతమ్ మీనన్ తీసిన ఈ సినిమాని మంజుల నిర్మించగా ఈ సినిమాలో జెస్సీ పాత్ర ద్వారా ప్రేక్షకాభిమానులు నుండి మంచి పేరు దక్కించుకున్నారు సమంత. ఇక తరువాత నుండి వరుసగా పలు అవకాశాలు అందుకున్న సమంత, వచ్చిన అవకాశాలను వినియోగించుకుని సూపర్ హిట్స్ సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా బాగా క్రేజ్ అందుకున్నారు.

ఇక అటు తమిళ్ లో కూడా పలువురు స్టార్ నటుల సరసన ఛాన్స్ లు అందుకుని దూసుకెళ్లిన సమంత తన ఫస్ట్ సినిమా హీరో చైతన్య తో తొలి చూపులోనే ప్రేమలో పడి అక్కడి నుండి ఇద్దరూ ప్రేమించుకుని ఇటీవల నాలుగేళ్ళ క్రితం ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. ముందుగా నాగార్జున కుటుంబ సభ్యులు వీరిద్దరి వివాహానికి ఒప్పుకోగా ఆ తరువాత సమంత ఫ్యామిలి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి వివాహం గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యులైన గెస్ట్ లు మాత్రమే హాజరైన ఈ వేడుకకి అప్పట్లో భారీ గానే ఖర్చు చేసారు.

ఆ విధంగా వేదమంత్రాల సాక్షిగా ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో జరిగిన వీరి వివాహబంధం నాలుగేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా సాగినప్పటికీ ఇటీవల మాత్రం కొన్ని అనుకోని కారణాల రీత్యా ఇద్దరూ విడిపోవలసి వచ్చింది. అయితే వారు విడిపోవడానికి గల కారణాలు ఏవైనా సరే వాటిని మనం అంగీకరించాలని, ఇలానే ఇకపై వారిద్దరూ మంచి స్నేహితులుగా కొనగాలని కోరుకుంటున్నారని ఇటీవల నాగార్జున తన సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా తెలిపారు. ఆ విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో ఘనంగా చేసుకున్న సమంత, చైతు, ఇద్దరూ కూడా డెస్టినీకి బలై విడిపోవలసి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: