పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న 'సలార్' సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ప్రభాస్ తో ఈ సినిమాలో కనిపించనుంది.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తోందట.ఆమె ఓ ఉన్నతాధికారి పాత్రలో కనిపించబోతోందని..తన అవసరం రీత్యా ఆమెతో ఓ ఎఫైర్ పెట్టుకొని తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని తెలుస్తోంది.

అంతేకాదు సినిమాలో వీరిద్దరి ట్రాక్ నాలుగు సీన్లతో ముగుస్తుందట.ఇక సలార్ కొత్త షెడ్యూల్ లో మీనాక్షి చౌదరి,ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ ని తీయబోతున్నారు.ఇప్పుడిప్పుడే తెలుగులో లైమ్ లైట్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈమె..ఇప్పటికే సుశాంత్ కి జోడిగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాలో నటించింది.గత నెలలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోగా.. సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇక ప్రస్తుతం రవితేజ ఖిలాడి,హిట్ 2 వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇప్పుడు ఈమె ఖాతాలో 'సలార్' సినిమా కూడా చేరింది.

 అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్న మీనాక్షి చౌదరి కి ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ రావడంతో..కచ్చితంగా ఈ సినిమాతో ఆమె కెరీర్ మంచి టర్న్ తీసుకుంటుందని అంటున్నారు.ఇక మరోవైపు సలార్ సినిమాని రెండు భాగాలుగా తీయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా సలార్ తెరకెక్కడంతో దాన్ని క్యాష్ చేయూకోవాలని నిర్మాతలు ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే ఇక నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లే అని చెప్పొచ్చు.ఇక వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: