టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంచుకుంటూ ఎంతో వేగంగా కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కొన్నాళ్ల క్రితం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె తో పాటు ప్రశాంత్ నీల్ తో సలార్, అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. అయితే ఈ మూడు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా వీటిని వచ్చే ఏడాది, అలానే ఆపై ఏడాది రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు ఇకపై రాబోయే సినిమాలు అన్ని కూడా భారీ స్థాయిలో రూపొందే పాన్ ఇండియా సినిమాలు అని తెలుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే త్వరలో ప్రభాస్ నటించనున్న కెరీర్ 25వ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రెండు రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి మూడు రోజులుగా పలు ఫిలిం నగర్ వర్గాలతో పాటు మీడియా మాధ్యమాల్లో కూడా వార్తలు విశేషంగా ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కెరీర్ 25వ మూవీ తీయనుంది సందీప్ రెడ్డి వంగా అని అంటున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి మూవీ తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన సందీప్ రెడ్డి, ప్రస్తుతం బాలీవుడ్ టాప్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా తీస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. అయితే ఇటీవల కొన్నాళ్లుగా ప్రభాస్ కోసం ఒక అద్భుతమై స్టోరీ సిద్ధం చేసిన సందీప్, రెండు రోజుల క్రితం అది ఆయనకు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారట. ఈనెల 7న దీనిపై ప్రకటన రానుందట. కాగా ఈ సినిమా కూడా భారీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: