మొదటి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీసు వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా కొండపొలం. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 8 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న మంగళవారం రోజు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో కొండపొలం మూవీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.
 కెరియర్ లో ప్రతి నటికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాలని ఉంటుంది. అలాంటిదే ఓబులమ్మ పాత్ర. ఆ పాత్ర చేయడం చాలా సంతోషంగా ఉంది, మరియు అదేవిధంగా చాలా గర్వకారణం గానూ ఉంది. ఇది ఒక చాలెంజింగ్ రోల్. ఈ పాత్ర చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను, నేను ఎంత ఎంజాయ్ చేశానో ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం ఉంది. కొండపొలం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి ఈ మ్యాజిక్ ను క్రియేట్ చేశారు. కొండపొలం సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కి రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది .కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో నటించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.


ఇక కొండపొలం హీరో వైష్ణవ్ తేజ్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.      
  వైష్ణవ్ చాలా పెద్ద స్టార్ అవుతాడు అని అందరూ అంటున్నారు, కానీ ఇప్పటికే వైష్ణవ్ గొప్ప స్టార్ అయ్యాడని, తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనే హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది .అందరి హీరోల్లో వైష్ణవ్ చాలా డిఫరెంట్ అని చెప్పింది. వైష్ణవ్ తేజ్ కళ్లు చాలా పవర్ఫుల్ అని చెప్పిన రకుల్ ఈవెంట్ లో ఫుల్ జోష్ లో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: