పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెలుగు క్రేజీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొండపొలం, ఈ సినిమా ను అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడం తో చిత్ర బృందం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న అనగా మంగళవారం రోజు భారీ ఎత్తున నిర్వహించారు, అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఈవెంట్ లో ప్రముఖ నటి హేమ మాట్లాడుతూ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ లో అందరు హీరోలతో నటించాను. ఒక వరుణ్ తేజ్ సినిమాలో మాత్రం నటించలేదు, తొందర లోనే ఆయనతో కూడా సినిమాల్లో నటిస్తాను అని తెలిపింది. ఇక వైష్ణవ్ తేజ్ గురించి హేమ మాట్లాడుతూ.
 
నన్ను ఎప్పుడూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు అని తెలిపింది. వైష్ణవ్ తేజ్ చాలా గొప్ప వ్యక్తి ఎక్కువగా మాట్లాడడు కానీ నటనలో మాత్రం చాలా ఫర్ ఫెక్ట్ అని హేమ తెలిపింది. ఇక కొండపొలం సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గురించి మాట్లాడుతూ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ను ఇచ్చినందుకు థాంక్స్ చేసింది. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడుతూ చాలా హార్డ్ వర్కర్, చెప్పిన టైం కు ఏ మాత్రం ఆలస్యం లేకుండా వస్తుంది అని హేమ తెలియజేసింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కు సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: