ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా నిత్యా మీనన్ ఒక కీలక పాత్ర చేసిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ జనతా గ్యారేజ్. మంచి అంచనాలతో కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. రాజీవ్ కనకాల, మలయాళ నటుడు మోహన్ లాల్, దేవయాని, సురేష్ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, దాని అనంతరం మరొక్కసారై కొరటాల శివ తో పని చేయనున్నారు.

ఇటీవల వీరిద్దరి నెక్స్ట్ ప్రాజక్ట్ కి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఎన్టీఆర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండే పాత్రలో ఈ సినిమాలో కనిపించనుండగా భారీ మాస్ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివసినిమా కథని ఎంతో అద్భుతంగా సిద్ధం చేసినట్లు టాక్. యువ సుధా ఆర్ట్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ఎంతో భారీ రేంజ్ లో నిర్మించనున్న ఈ సినిమాలో యువ సక్సెస్ఫుల్ నటి రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేయనుండగా అనిరుద్ స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం.

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ ని దసరా పండుగ రోజున జరిపేందుకు యూనిట్ సిద్దమవుతున్నట్లు టాక్. ఇక ఈ భారీ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కూడా స్పెషల్ గెస్ట్ లు గా విచ్చేయనున్నారట. ఇటీవల మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య మూవీ చేస్తున్నారు. మరి నిజంగానే మహేష్, చిరు కనుక ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ కి వస్తే నిజంగా కన్నుల పండుగే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: