అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న తాజా సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అలానే సాంగ్ శ్రోతలను ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక ఈనెల 13న ఈ సినిమా నుండి హీరోయిన్ రష్మిక మందన్న పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర తాలూకు సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా ని వాస్తవానికి డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించింది యూనిట్. అలానే అదే తేదీని అధికారికంగా ప్రకటించింది కూడా. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆచార్య మూవీ కూడా డిసెంబర్ 17నే విడుదల కానున్నట్లు చెప్తున్నారు. కాగా దానితో పుష్ప ని మరొక వారం పాటు ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు రాగా, అది నిజం కాదని, ఏకంగా పుష్పని వచ్చే ఏడాది మార్చి ఫస్ట్ వీక్ కి వాయిదా వేయాలని చూస్తున్నారట యూనిట్.

అయితే దానికి కారణం ఒకింత సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉండడమే అని అంటున్నారు. మరి ప్రస్తుతం విస్తృతంగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ, నిజంగానే పుష్ప మార్చి లో రిలీజ్ అవుతుందో లేక ముందుగా అనుకున్న ప్రకారమే డిసెంబర్ లో రిలీజ్ చేస్తారా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే మరికొద్దిరోజుల వరకు ఆగాల్సిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: