మెగాస్టార్ చిరంజీవి తో సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ తీస్తున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ ఇమేజ్ తో పాటు తన మార్క్ మెసేజ్ యాక్షన్ ని కలగలిపి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే నక్సలైట్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఆయన కుమారుడు రామ్ చరణ్ సిద్ద అనే పాత్ర చేస్తున్నారు.

యువ భామలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా తిరు ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే బయటికొచ్చిన టీజర్ ఒక సాంగ్ మెగాఫ్యాన్స్ ని ఆకట్టుకుని సినిమాపై భారీ గా అంచనాలు ఏర్పరిచాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విషయం లోకి వెళితే ఈ సినిమాని డిసెంబర్ 17న విడుదల చేయాలని సంకల్పించిన యూనిట్ రేపు మూవీ రిలీజ్ పై అధికారికంగా ప్రకటన చేయనుందట. వాస్తవానికి ఎపుడో మే లోని రిలీజ్ కావలసిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఆ తరువాత దసరా కి ఈ మూవీని రిలీజ్ చేస్తారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ దానిపై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక నిన్నటి నుండి ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతున్న న్యూస్ ని బట్టి రేపు పక్కాగా ఆచార్య నుండి డిసెంబర్ 17 విడుదల పై అనౌన్స్ మెంట్ ఖాయం అంటున్నారు. దేవాలయాల భూములు, కుంభకోణాల విషయమై కొన్నేళ్ల క్రితం జరిగిన కొన్ని వాస్తవ ఘటనలని బేస్ చేసుకుని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా కమర్షియల్ హంగులు కూడా జోడించి తీసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: