టాలీవుడ్ మాచో మాన్ గోపీచంద్ ఇటీవలే సీతీమార్ చిత్రంతో మంచి
సక్సెస్ అందుకున దూసుకు పోతున్నాడు. ఈ
సినిమా తర్వా త గోపీచంద్
మారుతి దర్శకత్వం లో పక్కా కమర్షియల్ అనే సినిమాను ఇప్పటికే మొదలుపెట్టాడు. రాశికన్నా
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా పక్కా కమర్షియల్ గా తెరకెక్కి వీరందరికి మంచి విజయాన్ని చేకూరుస్తుంది.
మరొకవైపు
మారుతి వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోవడం ఇంకోవైపు గోపీచంద్ మంచి ఫామ్లోకి రావడం వంటివి ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఇక
సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోక అలానే ఉండిపోయాయి. పెద్ద హీరోల సినిమాలు సైతం దీనికి అతీతం ఏమీ కాదు. ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఆగిపోతాయి. ఆ విధంగానే గోపీచంద్ నటించిన ఓ
సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు దగ్గరికి వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ విధంగా గోపీచంద్ ఎంతో ఇష్టపడి చేసిన ఆరడుగుల బుల్లెట్
సినిమా విడుదల వరకు వచ్చి ఆగిపోయింది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
నయనతార హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాను పలుమార్లు విడుదల చేయాలని భావించిన కూడా ఏదో ఒక కారణం అడ్డు తగులుతూ నే ఉంది కానీ గోపీచంద్ కు సిటీ మార్
సినిమా హిట్ పడిన తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని
అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేయగా ఆ సినిమాను గోపీచంద్ మాత్రం పట్టించుకోకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. ఎంత లేట్ అయినా కూడా ఆ
సినిమా గోపీచంద్ చేసిన సినిమానే కాబట్టి దానికి కొంత సహాయం చేస్తే బాగుండేదని అభిమానులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు.