విక్టరీ
వెంకటేష్ వరుస
రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు. ఇటీవలే
నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని ఎంతగానో అలరించిన
వెంకటేష్ ఇప్పుడు మరొక
రీమేక్ సినిమా దృశ్యం 2 తో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇది కూడా
నారప్ప లాగే ఓ టీ టీ లో విడుదలయ్యే
సినిమా అని చెబుతుండగా మరి కొంతమంది ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారు అని అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా చివరికి ఈ
సినిమా నిర్మాతలు ఇష్టప్రకారమే ఈ
సినిమా విడుదల అనేది ఆధారపడి ఉంది.
ఇకపోతే ఇటీవల కాలంలో సొంత కథలు రాసుకుని సినిమాలను తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువ అవుతున్నారు. గతంలో కొంతమంది రచయితలు రాసిన పుస్తకాలను ఆధారంగా సినిమాలు చేసేవారు ఆ తర్వాత దర్శకులు ఎక్కువగా సొంత కథలనే చేశారు కానీ ఇప్పుడు కొంతమంది పుస్తకాలను ఆధారం గా సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆ విధంగానే దర్శకుడు క్రిష్ ఇటీవల ఓ పుస్తకం ఆధారంగా కొండ పొలం సినిమాను తెరకెక్కించి ఇప్పుడు ఆ సినిమాను విడుదల చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే క్రిష్ తన తదుపరి
సినిమా ను కూడా నవల ఆధారంగా
సినిమా చేస్తున్నాడు అని తెలుస్తుంది. రాయల
సీమ ఫేమస్
రచయిత కేశవ
రెడ్డి రాసిన ఓ నవల ఆధారంగా ఆయన
వెంకటేష్ తో
సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివరాలు బయట పెట్టనున్నారు. రాయలసీమలో పేరుగాంచిన నవలా
రచయిత అయిన కేశవ
రెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు అనే నవలను కథ చేస్తున్నాడట.
విక్టరీ వెంకటేష్ కి చెప్పి ఇప్పటికే ఒప్పించడని తెలుస్తుంది. ప్రస్తుతం
వెంకీ కొన్ని
సినిమా లను చేస్తున్నాడు. క్రిష్ కూడా హరిహర వీరమల్లు
సినిమా చేస్తున్నాడు. ఆ
సినిమా పూర్తవగానే
విక్టరీ వెంకటేష్ తో ఈ నవల తో చేతులు కలపనున్నాడు క్రిష్.