తెలుగు సోషల్ మీడియా లో ఎక్కువగా ట్రోల్స్ పడే డైరెక్టర్ మెహర్ రమేష్. ఆయన ఒకప్పుడు తీసిన షాడో , శక్తి లాంటి సినిమాల్లో ఆయన తీసిన సీన్స్ ని ఇప్పటికి ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈమధ్య మెగాస్టార్ తో సినిమా ఒప్పించి ఆయన మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. మెగాస్టార్ చిరు మెహర్ రమేష్ తో సినిమా ఎందుకు ఒప్పుకున్నారు అని చాలామంది అభిమానులు బాధపడిన మాట నిజం.

తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వేదళం సినిమాని తెలుగులోకి మెహర్ రమేష్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమద్యనే మెగాస్టార్ పుట్టిన రోజుకు ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.అయితే ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాథర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో మెహర్ రమేష్ ని స్క్రిప్ట్ పని అంత పూర్తి చేయమని చెప్పారట. అయితే మెహర్ రమేష్ స్క్రిప్ట్ పూర్తి చేసి చిరు దగ్గరికి తీసుకెళ్తే మెగాస్టార్ కి స్క్రిప్ట్ లో కొన్ని సన్నివేశాలు అస్సలు నచ్చలేదు అని టాక్. ఇంత సమయం ఇచ్చిన కూడా మెహర్ రమేష్ ఇలాంటి తప్పులు చేయడంతో మెగాస్టార్ కి మెహర్ రమేష్ మీద నిరాశపడ్డాడట. దానితో మెహర్ తన టీం తో కలిసి భోళా శంకర్ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు అని టాక్.

ఇక ఈ సినిమాలో చిరు కి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్  రెండు లుక్స్ లో కనిపించబోతున్నారు అని టాక్. మంచి కమర్షియల్ సినిమా అయిన వేదళం ని మెహర్ రమేష్ ఎలా మారుస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. మెహర్ రమేష్ చేసిన రీమేక్ సినిమా బిల్ల మాత్రం మంచి హిట్ అయ్యింది. ఇదొక్క విషయమే అభిమానులని ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకునేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: