యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెర మీద ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోకు హోస్ట్  గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు. ఇలా మొదటి ఎపిసోడ్ లోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒకే షో లో కనబడటంతో జనాల్లో ఈ షోపై మంచి హైప్ క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా తన వాక్చాతుర్యంతో ఈ షోను మరింత విజయవంతం చేశాడు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్  స్టార్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, కొరటాల శివ లాంటి వారిని తన షోకు గెస్టులుగా తీసుకువచ్చి ఎవరు మీలో కోటీశ్వరులు షో ను మరింత జనాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు.

ఇలా వరసగా సెలబ్రెటీలను తన షో కు తీసుకు వస్తున్న ఎన్టీఆర్, మహేష్ బాబు ను కూడా తన షో కు  తీసుకురాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, దీనిని జెమినీ టీవీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో లీక్ ఫోటోలతో మహేష్ బాబు, ఎన్టీఆర్ షో కు వచ్చిన విషయం అందరికి తెలిసిపోయింది. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు , మహేష్ బాబు కు సంబంధించిన ఎపిసోడ్ ను దసరా సందర్భంగా టెలికాస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని జెమినీ టీవీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే మరి కొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రోమో లను జెమినీ టీవీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ మహేష్ బాబు, ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సంబంధించి మూడు ప్రోమో లను రెడీ చేసుకుంటున్నట్లు, ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఒకే షో లో పాల్గొనడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: