మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలలో రెండు
రీమేక్ సినిమాలే ఉన్నాయి. మెగా అభిమానులలో ఏదైనా నిరాశ ఉంది అంటే అది
రీమేక్ సినిమాలు అని చెప్పాలి. ఇతర హీరోలు
రీమేక్ సినిమాలను కాకుండా సొంత కథలను నమ్ముకొని
సినిమా లు చేసి సూపర్ సాధిస్తుంటే
మెగాస్టార్ చిరంజీవి మాత్రం
రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్ సాధించడం ఏమాత్రం మింగుడు పోవడం లేదు. ఆయన హీరోగా నటించిన ఆచార్య చిత్రం ఇపుడు విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో
బాబీ దర్శకత్వంలో సినిమాను డైరెక్ట్ తెలుగు
సినిమా చేస్తున్నానని చెప్పి ప్రేక్షకుల ఆగ్రహానికి కొంత వరకు తగ్గించారు. ఇకపై
రీమేక్ సినిమాలు ఎక్కువగా చేయకుండా చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ అలా హామీ ఇచ్చారో లేదో ఇప్పుడు ఆయన మరో
రీమేక్ సినిమా చేయవలసి వస్తుంది. అది ఎవరు వద్దు అనుకున్న కూడా
రీమేక్ సినిమా చేయవలసిన చిత్రమే. ప్రస్తుతం ఆయన
గాడ్ ఫాదర్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు.
నవంబర్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి ఇది
రీమేక్ కాగా తెలుగులో
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.
నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
త్రిష కథానాయిక అంటున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు పృధ్విరాజ్ l. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ జరిగితే మాత్రం తప్పకుండా
చిరంజీవి కూడా ఇక్కడ
రీమేక్ కొనసాగించాలి. ఈ నేపథ్యంలో
చిరంజీవి వద్దన్నా ప్రేక్షకులు వద్దన్నా చిరు మరో సినిమాను
రీమేక్ కావడం ఖాయమని తెలుస్తోంది.