టాలీవుడ్ సెలబ్రిటీలలో అన్యోన్యమైన జంటగా, క్యూట్ కపుల్ గా నాగ చైతన్య, సమంతల పేర్లు ఎపుడు మారు మ్రోగుతుంటాయి. అలాంటి బ్యూటిఫుల్ కపుల్ విడిపోతున్నారు అని తెలియడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని నేరుగా చైతు, సామ్ లే ప్రకటించడంతో అప్పటి వరకు ఎంతో కొంత ఆశతో ఉన్న బిలియన్ల మంది అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వీరి విడాకుల విషయం తెలియగానే సమంత ప్రజల నుండి , సెలబ్రెటీల వరకు అంతా సోషల్ మీడియా లో స్పందిస్తూ రకరకాల పోస్ట్లు పెడుతున్న విషయం తెలిసిందే..అయితే హీరో సిద్దార్థ్ పెడుతున్న పోస్ట్లు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. అతను డైరెక్ట్ గా వారి పేర్లు ప్రస్తావించక పోయిన ఈ హీరో పెట్టే పోస్ట్లన్ని సమంత విడాకుల విషయం చుట్టే తిరుగుతున్నాయి అంటున్నారు.

స్కూల్ లో మా టీచర్ నాకో పాఠం నేర్పించారు. మోసం చేసేవాళ్ళు ఎపుడు బాగుపడరు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్న సిద్దు మెసేజ్ హాట్ టాపిక్ గా మారింది. ఇది సమంతని ఉద్దేశించే చేశారని మాటలు వినిపించాయి.  అసలు ఈ మాట ఎందుకు వచ్చింది..అసలు అంతలా సిద్దార్థ్ కి సమంత కి మధ్య ఏమి మనస్పర్ధలు ఉన్నాయి అంటే, ఒకప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లికూడా చేసుకోవాలని అనుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ కొన్నాళ్ళకి అవన్నీ పుకార్లగానే మిగిలి చైతు, సామ్ ల వివాహం జరిగింది. ఇక అక్కడితో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.  మళ్ళీ ఇపుడు నాగ చైతన్య, సమంత లు విడాకులు తీసుకున్న తర్వాత సిద్దార్థ్ , సమంత లపై మళ్ళీ వార్తలు  ఫోకస్ అయ్యాయి.

అంతేకాదు తాజాగా సిద్దార్థ్ మీడియా ముందు మొదటి సారి చైతు, సామ్ ల విడాకుల విషయం గురించి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. వీరి విడాకుల గురించి సిద్దు స్పందిస్తూ లైఫ్ లో వచ్చే చిన్న చిన్న పొరపాట్లకు విడాకులు వరకు వెళ్ళడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదంటూ చెప్పడంతో మరోసారి సిద్దు.. సామ్ ల అంశం తెరపైకి వచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం సిద్దార్ధ్ కు ఎందుకు ఈ గొడవంతా ఎప్పుడూ ప్రేమించాడని ఇలా కక్ష సాధించడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే ఇది కావాలనే చేస్తున్నాడా లేదా ఇంకేమైనా ఉద్దేశ్యం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: