ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా జనాలు సినిమా లను థియేటర్ల లో చూడడం కంటే ఓ టి టి లో చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పవచ్చు. జనాలు ఓటిటి లో సినిమాలు చూడడానికి  కారణం ప్రస్తుతం బయటకు వెళ్లి కరోనా బారిన పడే కంటే  ఇంట్లో హాయిగా టీవీలో సినిమా చూస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ మంది జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దానికి తగినట్టుగానే ఓ టి టి సంస్థలు కూడా మంచి కంటెంట్ ను జనాల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని నెలలుగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో చాలా వరకు సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

 మొదట థియేటర్లలో విడుదల చేసిన సినిమాలను ఆ మూవీ విజయాన్ని బట్టి ఓటిటి లో స్ట్రీమ్మింగ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భం లోనే గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్గ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సిటీ మార్ సినిమా ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు, హీరో గోపీచంద్ కు దర్శకుడు సంపత్ నంది కి కూడా మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ ని దసరా సందర్భంగా అక్టోబర్ 15 వ  తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా సిటి మార్ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: