ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మా ఎలక్షన్స్ ఎంత రసవత్తరంగా మారాయో మన అందరికీ తెలిసిందే. రేపు అనగా అక్టోబర్ 10 వ తేదీన ఎలక్షన్స్ జరగనుండగా ఇప్పటివరకు కూడా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా ఎలక్షన్ల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరి పై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. వీరిద్దరు కూడా తమ తమ మద్దతుదారులతో ఎప్పటి కప్పుడు టీవీ ఛానల్ లలో ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొంటూ  ఓటర్ల ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ వెళుతున్న సమయంలో ఈ విషయం లోకి శివాజీ రాజా ఎంటర్ అయ్యాడు.

 తనపై నరేష్ గతంలో చేసిన ఆరోపణలను గుర్తు చేశాడు. ఎన్నికల వరకు మాత్రమే ఇలా ఉంటుంది ఆ తర్వాత మళ్లీ అందరూ కలిసి పోతారు. అయితే గెలిచిన వాడు నాలుగు రోజుల పాటు సంతోష పడితే, ఓడిన వాడు మాత్రం రెండు రెండు రోజుల పాటు బాధపడతాడు. ఆ తర్వాత మళ్ళీ అంతా సజావు గానే ఉంటుంది. ఒక వేళ మా బిల్డింగ్ కడితే సిమెంట్, ఇటుక ఎవరో తీసుకెళ్లారు అంటూ నరేష్ ఆరోపణలు చేస్తాడు. గత ఎన్నికల్లో తనపై చాలా తప్పుడు ఆరోపణలు చేసి  గెలిచాడు. అమెరికా టూర్‌ లో ఏదో జరిగిందని, ఎంతో నొక్కేశామంటూ ఆరోపణలు చేశాడు. అలాంటిది ఏమీ జరగలేదు అని కమిటీ కూడా నిర్ధారణ చేసింది. కనీసం ఆ తర్వాత అయిన నరేష్ సారీ చెబుతాడు ఏమో అని అనుకున్నా ను. వాడు సారీ చెప్పేంత వరకూ నేను తిడుతూనే ఉంటాను. ఎక్కడైనా కనిపించినట్లయితే మామూలు గానే ఉంటాం, కలిసి సినిమాలో నటిస్తాం అని శివాజీ రాజా ఒక మీడియా ఛానల్ లో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: