యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ షో ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను రంగంలోకి దించారు. ఇలా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఒకే షో లో కనబడటంతో మొదటి ఎపిసోడ్ కే ఈ షో జనాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా మొదటి షో తో వచ్చిన హైప్ ను ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో నిలబెట్టడానికి కృషి చేశాడు. మరియు అనుకున్న దాని కంటే ఎక్కువ రేంజ్ లో ఈ షో  ను ముందుకు తీసుకెళ్లడం కోసం ఎన్టీఆర్ తెలుగు లోనే ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులు అయిన రాజమౌళి, కొరటాల శివ ను కూడా మీలో ఎవరు కోటీశ్వరులు షో కు తీసుకు వచ్చాడు. ఇలా తెలుగు లోనే ప్రముఖ దర్శకులు ఇద్దరు ఎన్టీఆర్ షో లో కనబడటంతో ఈ షో పై జనాలు మరింత ఇంట్రెస్ట్ చూపారు.

 అయితే ఇలా వరుస పెట్టి సెలబ్రిటీలను తన షో లోకి తీసుకు వస్తున్న ఎన్టీఆర్, మహేష్ బాబుతో ఇప్పటికే ఈ షో కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయాన్ని జెమిని టీవీ నిర్వాహక బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే లీక్ ఫోటోలతో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అయితే మహేష్ బాబు తర్వాత ఈ షో కు సమంత కూడా రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సమంత తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు తెలుగులో మరో క్రేజీ హీరోయిన్ అయిన తమన్నాను కూడా ఎన్టీఆర్ తన షో లోకి తీసుకురానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: