సాయి ధరమ్ తేజ్ కి గత నెల ఆక్సిడెంట్ అవ్వడం ఆయన రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ స్పీచ్ ఇలా ఆయన పేరు న్యూస్ లో నిలుస్తూనే ఉంది.ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ అక్టోబర్ 1 న విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో సాయి నటన కి చాలా మంచి పెరు వచ్చింది.ఈ సినిమా చూసి నాని రివ్యూ విడుదల కాకముందే ఇచ్చారు. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ , మరియు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ స్పెషల్ షోస్ వెపించుకొని మరి ఈ సినిమా చూసారు.

 సాయి తేజ్ కి డైరెక్టర్ దేవా కట్టకి పవన్ , త్రివిక్రమ్ పువ్వుల కూడా పంపి శుభాకాంక్షలు తెలిపారు. ఒక కమర్షియల్ హీరో అయ్యి ఉండి ఇలాంటి సబ్జెక్ట్ ని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం అని అందరూ పొగిడారు. అయితే సినిమా అంతా గొప్పగా ఆడటంలేదు గాని చూసిన వాళ్ళు మాత్రం బాగానే ఉంది అంటున్నారు. అయితే సాయి తేజ్ తర్వాతి సినిమా మీద ఇప్పుడు టాక్ నడుస్తుంది. ఆయన మళ్ళీ సెట్స్ మీద షూటింగ్ కి ఎప్పుడు పాల్గొంటాడు అనేది ప్రస్తుత ప్రశ్న.ఈ ప్రశ్న నాగ బాబు ఈమద్యనే ఒక క్లారిటీ ఇచ్చారు.

సాయి తేజ్ ఇంకో రెండు నెలలలో మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటాడు అని ఆయన చెప్పారు. దీనితో సాయి తేజ్ ఫాన్స్ కి చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం సాయి తేజ్ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారట. మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదుట పడ్డకా షూటింగ్స్ మొదలుపెడతారు. ఈ మద్యనే కోలుకుంటున్న అని సాయి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం కొత్త కథలు వింటున్న సాయి తేజ్ త్వరలోనే ఆయన కొత్త సినిమా ప్రకటించబోతున్నారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: