రాజమౌళి దర్శకత్వం వహించిన
ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ
సినిమా రావడంతో అంతకుముందు సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకున్న కొంతమంది చిత్ర నిర్మాతలు హీరోలు కలవరపడుతున్నారు. చెప్పా పెట్టకుండా
రాజమౌళి తన
సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడం ఆయా హీరోల అభిమానులను సైతం అగ్రహించెల చేస్తుంది. ఆ విధంగా
రాజమౌళి దెబ్బకు ఇతర సినిమాల నిర్మాతలు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోక తప్పలేదు అని తెలుస్తుంది.
వారందరిలో ముఖ్యంగా మహేష్ బాబు తన సినిమాను తప్పకుండా పోస్ట్ పోన్ చేసుకోవాలని భావిస్తున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట
సినిమా చేస్తున్న మహేష్ బాబు తన సినిమాను
సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించి విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్ది
సినిమా ను విడుదల చేసి తన సూపర్ హిట్ లైన్ ను కంటిన్యూ చేయాలని భావించాడు మహేష్ బాబు. కానీ
రాజమౌళి తన సినిమాను అదే టైం కి విడుదల చేయడంతో అది చాలా ఇబ్బందికరంగా మారింది ఈ సినిమాకు.
ఇప్పుడేం చేయాలో తెలియక
రాజమౌళి కోసం మరొక సారి తన సినిమాను పోస్ట్
ఫోన్ చేయక తప్పడం లేదు మహేష్. గతంలో కూడా
బాహుబలి సినిమా కోసం ఆయన తన సినిమాను పోస్ట్ పోన్ చేశాడు. ఇప్పుడు మరొకసారి ఆయన కోసం త్యాగం చేయనున్నాడు మహేష్. మరి తన సినిమాను మళ్ళీ మహేష్ ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి.
రామ్ చరణ్ మరియు
ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ
సినిమా జనవరి 7 న రోజు విడుదల చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. భారీ బడ్జెట్
సినిమా కావడంతో త్వరగా విడుదల చేస్తే చాలా మంచిది కాబట్టి పలుమార్లు వాయిదా పడిన ఈ
సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని, అదే చాలా బాగుందని
రాజమౌళి విడుదల చేస్తున్నాడు.