మా ఎన్నిక‌లు తీవ్ర ఉత్కంఠ‌, ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య ముగిశాయి. మా చ‌రిత్ర లోనే ఎప్పుడూ లేన‌ట్టుగా రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదు అయ్యింది. అస‌లు ఈ సారి జ‌రిగిన పోలింగ్ మా పుట్టాక ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు. మొత్తం 925 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే వీరిలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పోలింగ్ ముగిసే స‌రికి ఏకంగా 626 మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు. మా లో మొత్తం 925 మంది ఉన్నా కూడా వారిలో 883 మందికి మాత్ర‌మే ఓటు హ‌క్కు ఉంది. రెండు గంట‌ల కే పోలింగ్ ముగియా ల్సి ఉంది. అయితే క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు 3 గంట ల వ‌ర‌కు టైం ఇచ్చారు.

ఇక చాలా మంది ముంబై , ఢిల్లీ, బెంగ‌ళూరు , చెన్నై నుంచి వ‌చ్చి కూడా మా ఎన్నిక‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు. ఎంతో మంది ప్ర‌ముఖులు ఈ సారి తీవ్ర‌మై న పోటీ దృష్ట్యా వ‌చ్చి ఓటు వేశారు. అయితే కొంద‌రు స్టార్లు మాత్రం ఈ సారి ఓటు వేయ లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - ద‌గ్గుబాటి వెంకటేష్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - ద‌గ్గుబాటి రానా తో పాటు హీరోయిన్లు హ‌న్సిక మెత్వాని , ర‌కుల్ ప్రీత్ సింగ్ , ఇలియానా , త్రిష లాంటి వాళ్లు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

ఇక హీరోయిన్ల సంగ‌తి ఎలా ?  ఉన్నా స్టార్ హీరోలు ఇంత పోటీ ఉన్నా బ‌య‌ట‌కు వ‌చ్చి ఓట్లు వేయ‌క పోవ‌డంతో అంద‌రికి షాక్ ఇస్తోంది. మా ఎన్నిక ల లో ఓటు వేయ‌డం అనేది స్టార్ల‌కు క‌నీస ధ‌ర్మం. అయితే వారు ఈ ధ‌ర్మం కూడా పాటించ లేక పోవ‌డంతో ప‌లు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: