ఇక చాలా మంది ముంబై , ఢిల్లీ, బెంగళూరు , చెన్నై నుంచి వచ్చి కూడా మా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ సారి తీవ్రమై న పోటీ దృష్ట్యా వచ్చి ఓటు వేశారు. అయితే కొందరు స్టార్లు మాత్రం ఈ సారి ఓటు వేయ లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - దగ్గుబాటి వెంకటేష్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - దగ్గుబాటి రానా తో పాటు హీరోయిన్లు హన్సిక మెత్వాని , రకుల్ ప్రీత్ సింగ్ , ఇలియానా , త్రిష లాంటి వాళ్లు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఇక హీరోయిన్ల సంగతి ఎలా ? ఉన్నా స్టార్ హీరోలు ఇంత పోటీ ఉన్నా బయటకు వచ్చి ఓట్లు వేయక పోవడంతో అందరికి షాక్ ఇస్తోంది. మా ఎన్నిక ల లో ఓటు వేయడం అనేది స్టార్లకు కనీస ధర్మం. అయితే వారు ఈ ధర్మం కూడా పాటించ లేక పోవడంతో పలు విమర్శలకు కారణమవుతోంది.