నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు, ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా, అఘోరాగా రెండు రకాల వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, అందుకు సంబంధించిన ప్రోమో లను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి ఆదరణ దక్కింది, వీటితో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ వీడియో సాంగ్ ను కూడా చిత్ర బృందం బయటికి విడుదల చేయగా దీనికి కూడా జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి ఇది హైడ్రిక్ సినిమా కావడం వల్ల ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతలోనే చిత్ర బృందానికి షాక్ తగిలింది. ఈ  సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ కు కరోనా వచ్చినట్టు స్వయంగా ఈ నటి నే తెలియజేసింది. పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నాక కూడా నేను కరోనా బారిన పడ్డాను అని, గతంలో కూడా నాకు కరోనా వైరస్ సోకింది. దీంతో అన్ని నిబంధనలు పాటిస్తూ.. నేను ఐసోలేషన్‌లోకి వెళ్లాను అని ప్రగ్యా జైస్వాల్ తెలిపింది. గత పది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ ప్రగ్యా సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న అఖండ సినిమా లో విలన్ గా శ్రీకాంత్ కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: