స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప. ఈ సినిమాలో పుష్ప రాజ్ అనే లారీ క్లీనర్ పాత్ర చేస్తున్న అల్లు అర్జున్సినిమా కోసం ఎంతో బాగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా తన పాత్ర కోసం పూర్తిగా క్రాఫ్ తో పాటు గెడ్డం కూడా పెంచిన అల్లు అర్జున్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, దాక్కో దాక్కో మేక సాంగ్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సంపాదించాయి. మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక విషయం ఏమిటంటే మొదట ఈ సినిమాని ఈ ఏడాది ఆగష్టు 11న విడుదల చేయాలనీ ప్రకటించిన యూనిట్, ఆ తరువాత కరోనా ప్రభావం వలన మూవీ షూట్ ఆగిపోవడంతో విడుదలని ఈ ఏడాది డిసెంబర్ 17కి వాయిదా వేసింది.

అయితే లేటెస్ట్ గా కొద్దిరోజుల నుండి వినపడుతున్న వార్తల ప్రకారం పుష్ప ని వచ్చే ఏడాది మార్చి రెండవ వారానికి వాయిదా వేసారని, మూవీకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అవడానికి మరికొంత సమయం పట్టేలా ఉన్నందున పుష్ప యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వాటన్నిటినీ కొట్టిపారేస్తూ ముందుగా తాము ప్రకటించిన విధంగానే క్రిస్మస్ కానుకగా పక్కాగా పుష్ప, సినిమా థియేటర్స్ లో ఉంటుందని యూనిట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక మరొక రెండు నెలల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పుష్ప రూపంలో ఫుల్ ఐ ఫీస్ట్ ఖాయం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: