టాలీవుడ్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట తాజా షెడ్యూల్ కోసం తన ఫ్యామిలీ తో సహా స్పెయిన్ వెళ్లిన విషయం తెల్సిందే. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక వడ్డీ వ్యాపారస్థుడిగా కనిపించనున్నారని అలానే ఈ సినిమాని పక్కాగా యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీ గా దర్శకుడు పరశురామ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా అలరించేలా ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్.

అయితే ఈ సినిమా తో పాటు ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న లేటెస్ట్ షో మీలో ఎవరు కోటీశ్వరులు షోలో కూడా మహేష్ బాబు సందడి చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. జెమినీ టివి లో ప్రసారం అవుతున్న ఈ షో కోసం ఒక రోజంతా ఎన్టీఆర్ తో కలిసి షూట్ లో పాల్గొన్న మహేష్ బాబు, భారీ స్థాయిలోనే ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు టాక్. అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్ ని దసరా పండుగ కానుకగా ప్రసారం చేస్తారని అందరూ భావించారు. అయితే ఆ ఎపిసోడ్ స్థానంలో సమంత తో నిన్న ఎన్టీఆర్ పాల్గొన్న లేటెస్ట్ ఎపిసోడ్ ని దసరా స్పెషల్ గా ప్రసారం చేయనుంది ఎవరుమీలో కోటీశ్వరులు యూనిట్.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ దీపావళికి ప్రసారం చేయాలని నిర్ణయించారట షో నిర్వాహకులు. ఇక ప్రస్తుతం దాని తాలూకు ఎడిటింగ్ వర్క్ వేగంగా జరుగుతోందని, దీపావళి రోజున ప్రసారం కాబోయే ఈ స్పెషల్ ఎపిసోడ్ అందరి నుండి మంచి క్రేజ్ అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో రేటింగ్స్ దక్కించుకోవడం ఖాయం గా కనపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: