అయితే ఈ సినిమా తో పాటు ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న లేటెస్ట్ షో మీలో ఎవరు కోటీశ్వరులు షోలో కూడా మహేష్ బాబు సందడి చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. జెమినీ టివి లో ప్రసారం అవుతున్న ఈ షో కోసం ఒక రోజంతా ఎన్టీఆర్ తో కలిసి షూట్ లో పాల్గొన్న మహేష్ బాబు, భారీ స్థాయిలోనే ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు టాక్. అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్ ని దసరా పండుగ కానుకగా ప్రసారం చేస్తారని అందరూ భావించారు. అయితే ఆ ఎపిసోడ్ స్థానంలో సమంత తో నిన్న ఎన్టీఆర్ పాల్గొన్న లేటెస్ట్ ఎపిసోడ్ ని దసరా స్పెషల్ గా ప్రసారం చేయనుంది ఎవరుమీలో కోటీశ్వరులు యూనిట్.
కాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ దీపావళికి ప్రసారం చేయాలని నిర్ణయించారట షో నిర్వాహకులు. ఇక ప్రస్తుతం దాని తాలూకు ఎడిటింగ్ వర్క్ వేగంగా జరుగుతోందని, దీపావళి రోజున ప్రసారం కాబోయే ఈ స్పెషల్ ఎపిసోడ్ అందరి నుండి మంచి క్రేజ్ అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో రేటింగ్స్ దక్కించుకోవడం ఖాయం గా కనపడుతోంది.