తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమా వచ్చినా తెలుగు ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారో లేదో తెలియదు కానీ సాక్ష్యం  సినిమా వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులందరూ థియేటర్లకు పరుగులు పెడతారు.  అంతలా ఫ్యాక్షన్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు ఈ ఫ్యాక్షన్ సినిమాలే అటు హీరోలకు మాస్ ఫాలోయింగ్ ని కూడా తెచ్చిపెట్టాయి అని చెప్పాలి.   అయితే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలతో అలరించారు.  ఇక వారు నటించిన  సినిమాలు సూపర్ డూపర్ హిట్ కూడా సాధించాయి. అయితే నేటి రోజుల్లో ఇలా ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాల్లో నటించింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి.



 ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. కానీ ఒక్క సినిమా మాత్రం ఎన్టీఆర్ అంచనాలను తలకిందులు చేసింది.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్    సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే ఇక ఆ సినిమాలో యాక్షన్, ఫ్యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది అని భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తరతరాల నుంచి వస్తున్న పగ ప్రతీకారాలు రక్తపాతం నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా  దమ్ము అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి.



 ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ టీజర్ విడుదల చేసి ప్రేక్షకులలో మరింత అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడం ఖాయం అని అనుకున్నారు ప్రేక్షకులు.  కానీ ఊహించని విధంగా ఈ సినిమా నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో కూడా  బోయపాటి మార్క్ కనిపిస్తోంది.  అంతేకాదు అతిగా నరుకకోవటం ఉండటం కూడా ప్రేక్షకులకు కాస్త నచ్చలేదు. కానీ కొంతమంది మాస్ ప్రేక్షకులను మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమా బాగా అలరించింది అని చెప్పాలి.  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాగా వచ్చి ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది  దమ్ము సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: