చిత్ర పరిశ్రమలో సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలో నటించారు. లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు ఒక వేశ్య పాత్ర ఇచ్చినా సరే తన సినిమాలో నటించడానికి నేను సిద్ధం అంటూ ఎప్పుడూ ఉండేది జయసుధ. అయితే ఆమె అనుకున్నట్టుగానే దాసరి ఒకసారి వేశ్య పాత్రను ఇచ్చారు. దానికి ఆమె ఎలాంటి మొహమాటం పడకుండా నటించి ఆ పాత్ర గాను నంది అవార్డు అందుకుంది.

అయితే ఒక్కనొక్క సమయంలో దర్శక ధీరుడు రాఘవేంద్రరావు 'జ్యోతి' అనే ఒక చిన్న సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమాలో హీరోగా మురళీ మోహన్‌ను సెలక్ట్ చేశారు. అయితే హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరు అనేది ఫైనల్ చేయలేదు. ఈ మూవీ కోసం కేరళ, మద్రాసుతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలు వచ్చి వెళ్తున్నారు. ఇక చివరికి ఎవరు కూడా రాఘవేంద్రరావుకు నచ్చలేదంట. ఈ తరుణంలో ప్రొడ్యూసర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా సినిమా ఎక్కడ ఆగిపోతుందోననే టెన్షన్ మురళీ మోహన్‌లో ఆందోళన మొదలైంది.

ఇక అప్పుడు మురళీ మోహన్ 'లక్ష్మణ రేఖ' అనే చిత్రంలో నటిస్తున్నానని, అందులో నటిస్తున్న జయసుధని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటే , చాలా బాగుంటుందని డైరెక్టర్ రాఘవేంద్రరావుకు మురళీ మోహన్ చెప్పరంట. అయితే అప్పుడు రాఘవేంద్ర రావు.. ఎవరు ఆ అమ్మాయి.. బాగుంటుందా..? బాగా నటించగలదా..? అని పలు ప్రశ్నలు ఆయనని అడిగి వివరాలు తెలుసున్నారంట. దాని మురళి మోహన్ బాగా నటిస్తోందని  చెప్పారు.

అంతేకాదు.. సదరు అమ్మాయి ఆల్బమ్ తెప్పించు చూద్దాం అని రాఘవేంద్రరావు అన్నారంట. అంతేకాక.. మురళీ మెహన్ ఆ రోజు సాయంత్రమే జయసుధ ఆల్బమ్ తెప్పించి చుపించారంట. ఇక ఆల్బమ్ చూసి హీరోయిన్‌గా జయసుధను డైరెక్టర్ ఓకే చేశారంట. అయితే అలా 'జ్యోతి' సినిమాకు హీరోయిన్ ఫైనల్ చేయడంలో హీరో మురళీ మోహన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మురళీమోహన్ కారణంగానే జయసుధ మంచి హీరోయిన్ గా గుర్తింపుని తీసుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: