యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు, ఆ తర్వాత కూడా సాహో సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి, అదే స్థాయిలో విడుదల చేసిన ప్రభాస్ వరుస పాన్ ఇండియ సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆది పురుష్ సినిమా ఒకటి. ఓంరౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్ -3డి`  చిత్రం గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా...కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నిసింగ్ కనిపించబోతున్నాడు. ఇక రామాయాణంలో మరో అత్యంత కీలక పాత్ర అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఇలా దిగ్గజ నటులతో ఆది పురుష్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఇండియా లోని వివిధ ప్రాంతా లలో జరిగింది. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ హైదరాబాద్, ముంబై లలో ప్రత్యేక సెట్ వేసి తెరకెక్కించారు.  అక్టోబర్ నెల చివరి వరకు ఈ సినిమా షూటింగ్ దాదా పుగా పూర్తి అవుతుంది అని తెలుస్తోంది. ఇక మూవీ షూటింగ్ వేగంగా పూర్తయిన సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. పైగా 3డీ మూవీ కాబట్టి టెక్నికల్ వర్క్ పై ఎక్కువ సమయం పని చేయవలసి ఉంటుంది. దీని లో భాగంగా దేశ విదేశాల్లో సీజీకి సంబంధించిన   పనులను  వివిధ కంపెనీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అవతార్ సినిమాకు పని చేసిన నిపుణులు ఈ సినిమా కు పని చేయబోతున్నారు అంటూ అప్పట్లో అనేక కథనాలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: