మహేష్ బాబు కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం సరిలేరు నీకెవ్వరు అని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ఈ చిత్రం అతి తక్కువ కాలంలోనే పూర్తి కావడమే కాకుండా మహేష్ బాబుకు సూపర్ డూపర్ హిట్ ను తీసుకుచ్చింది. ఈ సినిమా దిల్ రాజు నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.  2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఆ సీజన్ లో వచ్చిన సినిమాలను దాటేస్తు భారీ వసూళ్లను సాధించి సరిలేదు సినిమా కేదీ అనిపించుకుంది.  

భారత ఆర్మీ లో కీలకమైన ఆఫీసర్ గా ఉన్న హీరో తన తోటి ఆర్మీ ఆఫీసర్ ఓ ప్రమాదంలో గాయపడితే ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పాలని రాయలసీమకు చెందిన ఓ ప్రాంతానికి వస్తాడు.  ఆ విధంగా ఆ ఆర్మీ ఆఫీస్ కుటుంబం లోకల్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. ఆ ఇబ్బందుల నుంచి ఆ కుటుంబాన్ని కాపాడబోయిన హీరో ఆ ఇంటికి మరో కొడుకుగా నిలుస్తాడు.  మహేష్ బాబు మంచి కథ ఉన్న చిత్రాన్ని ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించాడు.

రష్మిక మందన తొలిసారి మహేష్ బాబు తో జోడీ కట్టగా ఆయనతో ఆమె వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఎంతైనా మహేష్ బాబు ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు చేసినా కూడా వాటన్నిటికీ భిన్నంగా ఇది ఉందని చెప్పవచ్చు.  సెకండాఫ్ లో మహేష్ బాబు చెప్పే డైలాగులు అన్నిటికీ ఫైట్స్ కి మంచి మార్కులు బాగానే పడ్డాయి. ఆ విధంగా మహేష్ బాబు ఈ చిత్రం లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కూడా మహేష్ బాబు తొలి భాగంలో వచ్చే మొదటి 15 నిమిషాలలో ప్రేక్షకులను కన్నులపండుగ చేశాడు. ఒకే ఇన్ని రకాల పాత్రలు పోషించి మహేష్ హీరోగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: