అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, ఆ తర్వాత  ఈ బ్యూటీ టాలీవుడ్ వైపు అడుగులు వేసింది, అందులో భాగంగా మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే టాలీవుడ్ లో మరో స్టార్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఇలా టాలీవుడ్ లోకి రావడం తోనే ఇద్దరు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి తెలుగు సినిమాలో నటిస్తోంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ, సిద్ధార్థ మల్హోత్రా తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి షేర్‌షా సినిమాలో నటించింది.

సినిమా ఇటీవల ఓటీటీ  లో విడుదలైన మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ఆ మూవీలో హీరో సిద్ధార్థ్‌ తో తెరపై పండిన రొమాన్స్‌ గురించి ఓ ఇంటర్వూలో కియారా అద్వాని మాట్లాడింది. బిగ్ స్క్రీన్ పై ఎవరు కెమిస్ట్రీని పండించే లేరు. దర్శకుడు చెప్పింది మాత్రమే చేయగలం. ఈ మూవీలో నేను, సిద్ధార్థ్ అదే చేశాం. అంతే కానీ ఏ ఇద్దరూ నటులు కూడా కథలో లేని దాన్ని చేసి చూపించలేరు’ అని కియారా అద్వానీ తెలిపింది. విక్రమ్‌ బత్రా, మరియు ఆయన గర్ల్ ఫ్రెండ్ డింపుల్‌ మధ్య జరిగిన విషయాలను డింపుల్‌ చెప్పింది కాబట్టే వారిద్దరూ చేయగలిగినట్లు నటి చెప్పింది. ఇది ఇలా ఉంటే కియారా అద్వానీ ప్రస్తుతం హిందీలోజగ్ జగ్ జీయో’,‘భుల్‌ భులయ్యా 2 సినిమాలలో నటిస్తుంది. వీటితో పాటు తెలుగులో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: