టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో హిట్,  సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. తన సినిమాల విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త రకం కథ లను ఎంచుకుని, తెలుగు ప్రేక్షకుల ను ఎంతో అలరించే మహేష్ బాబు తన లుక్ విషయం లో మాత్రం పెద్దగా వేరియేషన్స్ చూపించాడు అని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో వచ్చిన టక్కరి దొంగ సినిమాలో కౌబాయ్ గెటప్ లో కనిపించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మహేష్ బాబు, ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ ఒకే తరహా లుక్ లో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇన్నాళ్ల కు మళ్లీ ఒక డిఫరెంట్ గెటప్ లో మహేష్ బాబు కనిపించేందుకు రెడీ అవుతున్నారట.

వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న మహేష్ బాబు  ప్రస్తుతం గీత గోవిందం పేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు జంటగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో దర్శకుడు పరుశురామ్ ఒక ప్రయోగం చేయించనునట్లు వార్తలు వస్తున్నాయి. ఒక యాక్షన్ సన్నివేశంలో మునుపెన్నడూ కనిపించని విధంగా మహేష్ బాబు ని పవర్ఫుల్ గా చూపించడానికి దర్శకుడు పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నాడట. నరసింహ స్వామి గెటప్ లో మహేష్ బాబు ను వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారట. ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు లుక్ ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: