మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నాడు.
సంక్రాంతి తర్వాత
ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేసే విధంగా ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చాడు చిరు. దసరా సీజన్
దీపావళి సీజన్
క్రిస్మస్ సీజన్ అలాగే
సంక్రాంతి సీజన్ ఏ మాత్రం తనకు అనుకూలంగా లేకపోవడంతో
మెగాస్టార్ తన సినిమాను
ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసేందుకు నిశ్చయించుకున్నాడు చిరు. ఈ చిత్రంలో
రామ్ చరణ్ కీలకపాత్ర చేయడమే కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు కూడా..
అందుకే ఎటువంటి హడావుడి లేకుండా ఎటువంటి పోటీ లేకుండా తన సినిమాను
ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అయితే ఇందులో
చిరంజీవి మాస్టర్ ప్లాన్ కూడా ఉందట. ఈ
సినిమా నీ
ఫిబ్రవరి కి తీసుకు పోవడం పట్ల అభిమానులు నిరాశ పడుతున్న కూడా తాను ఎందుకు ఈ విధంగా చేశాను అని అభిమానులకు వెల్లడిస్తున్నాడు
మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్
సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ
సినిమా విడుదలైన తర్వాత
రామ్ చరణ్ కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో నటించిన
రామ్ చరణ్ క్రేజ్ తో ఆచార్య
సినిమా పబ్లిసిటీ చేసి తద్వారా తన సినిమాను లాభాల్లోకి తీసుకు వెళ్ళే విధంగా
మెగాస్టార్ ప్లాన్ చేశాడట. ఏదేమైనా
మెగాస్టార్ చిరంజీవి వేసిన ఈ ప్లాన్ కు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా
రామ్ చరణ్ జోడీగా పూజాహెగ్డే నటించింది.
మణిశర్మ సంగీతం అందించిన ఈ
సినిమా నుంచి ఓ పాట విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోగా చాలా రోజుల తర్వాత
మెగాస్టార్ చిరంజీవి నుంచి విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.