మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేసే విధంగా ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చాడు చిరు.  దసరా సీజన్ దీపావళి సీజన్ క్రిస్మస్ సీజన్ అలాగే సంక్రాంతి సీజన్ ఏ మాత్రం తనకు అనుకూలంగా లేకపోవడంతో మెగాస్టార్ తన సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసేందుకు నిశ్చయించుకున్నాడు చిరు.  ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలకపాత్ర చేయడమే కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు కూడా..

అందుకే ఎటువంటి హడావుడి లేకుండా ఎటువంటి పోటీ లేకుండా తన సినిమాను ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అయితే ఇందులో చిరంజీవి మాస్టర్ ప్లాన్ కూడా ఉందట. ఈ సినిమా నీ ఫిబ్రవరి కి తీసుకు పోవడం పట్ల అభిమానులు నిరాశ పడుతున్న కూడా తాను ఎందుకు ఈ విధంగా చేశాను అని అభిమానులకు వెల్లడిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.  రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో నటించిన రామ్ చరణ్ క్రేజ్ తో ఆచార్య సినిమా పబ్లిసిటీ చేసి తద్వారా తన సినిమాను లాభాల్లోకి తీసుకు వెళ్ళే విధంగా మెగాస్టార్ ప్లాన్ చేశాడట. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి వేసిన ఈ ప్లాన్ కు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ఎంతో ఆశ్చర్యపోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ జోడీగా పూజాహెగ్డే నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోగా చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: