మహేష్ బాబు నుండి మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కీర్తి సురేష్ తో కలిసి సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని స్పెయిన్ లో చిత్రికరిస్తోంది యూనిట్. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ అవతార్ లో కనిపించనుండగా కీర్తి సురేష్ కూడా తన కెరీర్ లో చేయని ఒక విభిన్న పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన బ్లాస్టర్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు అది సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాని మూవీ యూనిట్ సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని అల్లు అరవింద్ కి చెందిన ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా అత్యధిక ధరకు కొనుగులు చేసినట్లు చెప్తున్నారు.

ఇప్పటికే సర్కారు వారి పాట టీమ్ తో దీనికి సంబంధించి డీల్ కూడా కుదరగా దీని అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు సమాచారం. సముద్రఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని యాక్షన్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తీస్తున్నారని, అలానే విడుదల తరువాత సర్కారు వారి పాట మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: