సినిమా అంటే మూడు ఫైట్లు, ఆరు పాటలు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ బాగా మారిపోయింది. చాలా వరకు కథనే హీరో చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మేకర్స్. అయితే ప్రస్తుతం తరం సినిమాలలో డైలాగులు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సినిమాలో అదిరిపోయే డైలాగులు ఉంటే 'తగ్గేదే లే' అంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాయి మూవీస్. కొన్ని సినిమాలకు అయితే చిన్న డైలాగుతో విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఆ జాబితాలో 'పుష్ప'రాజ్ ముందున్నాడు. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ 'పుష్ప' నిర్మితం అవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా, అందులో అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదే లే' డైలాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఇంకా ఆ టీజర్ లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అల్లు అర్జున్ లుక్, రాయలసీమ యాస, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. కానీ టీజర్ లో వచ్చిన చివరి డైలాగ్ 'తగ్గేదే లే' మిగతా హైలెట్స్ ను వెనక్కి నెట్టేసింది. ఒకే ఒక్క డైలాగ్ తో ఈ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకింది.

ఇలా సినిమా కు హైప్ తీసుకొచ్చి కావల్సినంత ప్రచారాన్ని పెంచుతున్నాయి డైలాగులు.  ఈ డైలాగ్ వచ్చినప్పటి నుంచి సందర్భానికి తగ్గట్టుగా 'తగ్గేదే లే' అనే డైలాగ్ ఉపయోగిస్తున్నారు యూత్. ఇలా సినిమాతో పాటు, ప్రచార కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి డైలాగులు. అందుకే ఈ తరం దర్శకనిర్మాతలు అంతా డైలాగులపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇక 'పుష్ప' విషయానికి వస్తే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీవల్లి గా కనిపించబోతోంది రష్మిక మందన. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల గురించి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 'పుష్ప' నుంచి రెండో పాట విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: