టాలీవుడ్
సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని డైలాగ్స్ కు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఆ
సినిమా ను ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవి
సినిమా లో ఫేమస్ డైలాగ్ అయితే ఇంకాస్త ఎక్కువగా అందరిని అలరిస్తూ ఉంటుంది. ఓ
సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కథ కథనం హీరో
హీరోయిన్ సంగీతం వంటివి ఇలాంటి ముఖ్య కారణాలు అవుతాయో అలా వాటికి ఏ మాత్రం తీసిపోకుండా డైలాగ్స్ కూడా ఓ
సినిమా సూపర్ హిట్ అయ్యే విషయంలో మంచి పాత్రను పోషిస్తాయి.
ఆ విధంగా ఎన్నో సినిమాలు కేవలం డైలాగ్స్ బాగున్నాయి అనే కారణంతో సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే
ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో కథ కథనాలతో పాటు డైలాగ్స్ కూడా చాలా బాగా ఉండటం వల్లనే ఈ
సినిమా అంత పెద్ద సూపర్ హిట్ అవ్వగలిగింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఒక్క అడుగు అనే డైలాగ్ కు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇప్పటికీ ఆ డైలాగ్స్ ను కొన్ని కొన్ని సందర్భాల్లో వినడం మనం చూస్తూ ఉంటాం.
వాడు పోతే వీడు వీడు పోతే వాడు వాడు పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అని
ప్రభాస్ ఎంతో ఎమోషనల్ గా చెప్పే ఈ డైలాగ్ థియేటర్లో ప్రేక్షకులతో విజిల్స్ చప్పట్లు కొట్టించాయని చెప్పొచ్చు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ చిత్రం
ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం అయ్యింది. ఈ
సినిమా కు రెండు నంది అవార్డులు కూడా దక్కడం విశేషం. పలు భాషలలో ఈ చిత్రం రీమేక్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీయ
హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి
కీరవాణి సంగీతం అందించగా
రాజమౌళి కెరీర్లోనే పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.