ఆ సినిమాలో
మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ కి
సినిమా హాల్లో క్లాప్స్ కొట్టారు. బి.గోపాల్ దర్శకత్వంలో 2002వ సంవత్సరంలో ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ
సినిమా తెరకెక్కగా
వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనుకున్న విధంగానే ఈ
సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలలో క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలోని డైలాగులు విపరీతమైన ప్రేక్షకాదరణ పొందాయి.
ముఖ్యంగా వీర
శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక
కోస్తా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యింది. ఇంకా సింహాసనంపై కూర్చునే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిని ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డి అని చెప్పే డైలాగ్ మరింత ప్రేక్షకాదరణ పొందింది. ఇంకా
కాశీ కి వెళ్ళాడు కాషాయం వాడయ్యాడు అనుకున్నారా వారణాసి వెళ్ళాడు వరస మార్చుకున్నాడు అనుకున్నారా.. అదే రక్తం.. అదే పౌరుషం.. అని
చిరంజీవి డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు ఏ విధంగా ఎంజాయ్ చేశారో అప్పట్లో ఈ
సినిమా థియేటర్లో చూసిన ప్రతి వారికి తెలుసు. ఇక శౌక తాలి ఖాన్ అంటూ ఆయన చెప్పిన మరో డైలాగ్ కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ కాగా ఈ
సినిమా మెగాస్టార్ చిరంజీవి కి నంది అవార్డు కూడా లభించడం విశేషం.