తెలుగు చిత్ర పరిశ్రమలో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చికున్న నటుడు వడ్డే నవీన్. ఆయన తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ పముఖ నిర్మాత అందరికి తెలిసిన విదితమే. అంతేకాదు.. వడ్డే నవీన్ యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉంటారు. అయితే వడ్డే నవీన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వడ్డే నవీన్ ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

ఆయన లవ్ స్టోరీలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి వడ్డే నవీన్ ప్రేక్షకులను అలరించారు. ఇక ఆయన తెలుగులో 30కు పైగా సినిమాలలో నటించారు. ఆయన నటించిన సినిమాలో మెజారిటీ సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. కాగా.. 2001 సంవత్సరం తర్వాత వడ్డే నవీన్ నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కావడంతో నవీన్ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎటాక్ సినిమాలో వడ్డే నవీన్ చివరగా తెరపై కనిపించారు.

ఇక ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత వడ్డే నవీన్ మాట్లాడుతూ సినిమాలలో రీఎంట్రీకి సిద్ధమేనని కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. అయితే కథ నచ్చడంతో పాటు పాత్ర నచ్చితే సినిమాలలో నటిస్తానని వడ్డే నవీన్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకు తనకు ఇంటర్వ్యూలు ఇచ్చే అవసరం రాలేదని త్వరలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తానని వడ్డే నవీన్ తెలిపారు. అయితే వడ్డే నవీన్ తాజా ప్రకటన గురించి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వడ్డే నవీన్ తాజా ప్రకటనతో దర్శకనిర్మాతలు ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతారేమో చూడాలి మరి. వడ్డే నవీన్ రీఎంట్రీలో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాలి మరి. ఆయన రీఎంట్రిలో మంచి విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: