మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు సినిమాలను పూర్తి చేసాడో లేదో తన మూడవ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకువెళుతున్నాడు. ఇప్పటికే ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేశాడు. అలాగే తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమాను కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా తానే కావడం విశేషం. ఆచార్య చిత్రంలో 30 నిమిషాలు కనబడే ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించగా ఈ సినిమాలో ఇదే హైలెట్ అని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ తో కలిసి అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత నెల రోజుల వ్యవధిలో ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 4 న ఈ సినిమా వస్తుంది. దాంతో ఒకే నెల వ్యవధి లో రామ్ చరణ్ ఇలా రెండు సినిమాలతో ప్రేక్షకులను అభిమానులను అలరించడం వారికీ ఎంతగానో సంతోషాన్ని కలగచేస్తుంది. 

అయితే ఈ రెండు సినిమాలు సిద్ధమయ్యాయో లేదో శంకర్ తో ఆయన చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం సెట్స్ మీదకు అక్టోబర్ 22వ తేదీ నుంచి తీసుకు వెళ్ళనున్నాడు రామ్ చరణ్. ఇటీవల కాలంలో ప్రతి హీరో మూడు సినిమాలను చేస్తూ పోతుండడంతో రామ్ చరణ్ కూడా రెండు సినిమాలను పూర్తి చేసి ఇప్పుడు మూడవ సినిమా మొదలు పెట్టడం మెగా అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. మరి రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ మంచి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుండగా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కాబోతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్.  భారీ చిత్రాలను తెరకెక్కించడంలో శంకర్ కు పెట్టింది పేరు. అలాంటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: