బుల్లితెర పై టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ లో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న షో ఇది.గత కొన్ని సంవత్సరాల నుండి బుల్లితెర అభిమానులను రక రకాల కామెడీ స్కిట్స్ తో వినోదాన్ని పంచుతున్న ఈ షో అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే.ఇక ఈ షోకి జడ్జ్ లుగా మెగాబ్రదర్ నాగబాబు, రోజా వ్యవహరించేవారు.అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.అక్కడి నుంచి వచ్చాక మరో ప్రముఖ ఛానెల్ లో అదిరింది అనే షోను జబర్దస్త్ కి పోటీగా పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ కొంతకాలం నుండి ఆ షోను ఆపేశారు నిర్వాహకులు.కానీ ఎన్ని షోలు పోటీకి వచ్చినా జబర్దస్త్ మాత్రం తన సత్తా చాటింది. దీంతో నాగబాబు తిరిగి మళ్ళీ జబర్దస్త్ లోకి రానున్నారనే వార్తలు ఇప్పుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తాజాగా ఈ విషయమై స్పందించిన నాగబాబు..జబర్దస్త్ షోలో చేసే ఇద్దరు యువకులు తన దగ్గరికి వచ్చి మునుపటిలా షోకి రమ్మని వాళ్ళు అడిగారని నాగబాబు అన్నారు.అయితే తాను రాకుండా ఉండటానికి కారణాలు ఏం లేవు.ఈటీవీ వాళ్ళు,మల్లెమాల వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ జబర్దస్త్ షోలోకి వస్తానని నాగబాబు స్పష్టం చేశాడు.అయితే తాను వచ్చేముందు మెంబర్స్ కి, కుర్రవాళ్ళకి కొన్ని గొడవలు అయ్యాయని..

దానికి స్పందించి తాను వెళ్లిపోయానని నాగబాబు తెలిపారు.ప్రస్తుతం అవన్నీ ఇప్పుడు సాల్వ్ అయ్యాయని..ఇప్పుడు జబర్దస్త్ లోకి వెళ్ళడానికి తనకేం అభ్యంతరం లేదని తెలిపారు నాగబాబు.ప్రస్తుతం జబర్దస్త్ లో నాగబాబు స్థానంలో మనో గారు అలాగే రోజా జడ్జ్ లుగా కొనసాగుతున్నారు. ఒకవేళ నాగబాబు కనుక జబర్దస్త్ కి రీఎంట్రీ ఇస్తే..అతని స్థానంలో జడ్జి గా కొనసాగుతున్న మనో గారు జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సిందేనా అంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా నాగబాబు కనుక జబర్దస్త్ కి కనుక రీఎంట్రీ ఇస్తే.. మళ్ళీ జబర్దస్త్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు...!!,

మరింత సమాచారం తెలుసుకోండి: