రెండు రోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేటెస్ట్ ఎన్నికల్లో భాగంగా తన ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు అత్యధిక మెజారిటీ తో గెలిచి అధ్యక్షుడి పీఠాన్ని కైవశం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఎన్నికల్లో కొందరు విష్ణు ప్యానల్ సభ్యులు గెలవగా మరికొందరు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా విజయడంకా మ్రోగించారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నిన్న తన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్ నేడు తన ప్యానల్ సబ్యలతో కలిసి కొద్దిసేపటి క్రితం మీటింగ్ పెట్టడం ఆపైన ఎన్నికయిన ఆయన ప్యానల్ సభ్యులు అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ మరియు ఇతర మరికొందరు సినిమా నటులు కలిసి మా కి పోటీగా ఆత్మా పేరుతో మరొక నూతన సంఘాన్ని ఏర్పాటు చేయదలచినట్లు టాక్. ప్రస్తుతం ఆ దిశగా పలువురితో ప్రకాష్ రాజ్ చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అనూహ్య పరిణామంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రెండూగా చీలిందని అంటున్నాయి సినిమా వర్గాలు.

నిజానికి విష్ణు విషయం పరిశీలిస్తే ఆయనకు కృష్ణ, కృష్ణంరాజు, శరత్ బాబు, బాలయ్య ఇలా పలువురు సీనియర్ అలాే స్టార్ యాక్ట్రస్ మద్దతు లభించగా, అటు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ నుండి అలానే వారి అనునాయుల నుండి పూర్తి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే సినిమా నటులు పక్కాగా రెండుగా చీలినట్లు స్పష్టం అవుతోందని, మరోవైపు విష్ణు విజయం తరువాత నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వంటివి చూస్తుంటే మెగా ఫ్యామిలీ సరిపోర్టర్స్ అందరూ ఒకవైపు అలానే మిగతా వారు మరొకవైపు నిలిచే ఛాన్స్ కనపడుతోందని ఇంకొందరు అంటున్నారు. కాగా ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎంతవరకు దారితీస్తాయో చూడాలని పలువురు సినిమా ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: