సినిమా ఇండస్ట్రీకి చెందిన 'మా' ఎన్నికలు అక్టోబర్ 10 న జరిగిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు ఎంతో హోరా హోరీగా జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ పోటీ పడగా.. ఈ పోటీలో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు.అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రకాష్ రాజ్..తన ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లంతా కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు ప్రకాష్ రాజ్.ఈ సందర్భంగా నటుడు బెనర్జీ మాట్లాడుతూ..ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

ఈ మేరకు బెనర్జీ మాట్లాడుతూ..'నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా..నాకు సంతోషంగా లేదు.ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను.ఒక వైపు మోహన్ బాబు తనీశ్ ను తిడుతున్నారు.నేను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దు నాన్నా అని అన్నాను.అది విన్న మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు.అప్పుడు విష్ణు ఆయన్ని అడ్డుకొని నన్ను పక్కకు లాగేసాడు.అసభ్య పదజాలంతో నను తిట్టి పోశారు మోహన్ బాబు.అమ్మానా బూతులు తిట్టారు.ఆయన నన్ను అన్న మాటలకు షాక్ లోకి వెళ్లిపోయా.మోహన్ బాబుకి వివాహం కాకముందు నుండి ఒక ఇంటి సభ్యుల్లా ఉన్నాం.చిన్నప్పుడు మంచు విష్ణు ని, మంచు లక్ష్మి ని ఎత్తుకొని తిరిగేవాడిని.

అలాంటి నన్ను పట్టుకుని మోహన్ బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్ లు వచ్చి 'సారీ అంకుల్..ఏమీ అనుకోవద్దు.మీరు కూడా ఏమీ అనొద్దు' అని సముదాయించే ప్రయత్నం చేశారు.నాకు నా తల్లే సర్వస్వం,ఆమెను తిడుతుంటే నాకు చాలా బాధేసింది.రేపు కార్యవర్గం సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు.వాళ్ళకి భయపడుతూ ఉంటడం కంటే రాజీనామా చేయడం మంచిది'అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు.దీంతో మోహన్ బాబు గురించి బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.ఈఈ విషయంలో మోహన్ బాబు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని పలువురు ఇండ్రస్టీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: