నందమూరి బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

ఆహా వేదికగా బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే టైటిల్ తో రాబోతున్నట్లు వార్త వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.. టాక్ షో లో భాగంగా ప్రముఖ సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాలను ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ నటించనున్నారని తెలుస్తుంది .

అయితే ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు కుటుంబంలోని పలువురు హాజరవుతున్నారని వార్త వినిపిస్తుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తుంది. మెగా కుటుంబం నుంచి కాకుండా అక్కినేని నాగార్జున ఆయన పిల్లలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అల్లుఅరవింద్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

అదే విధంగా కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పలువురు దర్శక నిర్మాతలు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనునట్లు సమాచారం. ఈ కార్యక్రమం దీపావళి నుంచి ప్రసారం కానుందని వార్త వినిపిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో షూటింగ్ పూర్తి చేసుకున్నారు అని తెలుస్తుంది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోందని తెలుస్తుంది. అయితే ఇంతకుమునుపే ఆహాలో సమంత మరియు రానా అలాగే మంచు లక్ష్మి సందడి చేసిన విషయం మనకు అందరకు తెలిసిందే.మరి చూడాలి బాలయ్య టాక్ షో ఎంత పాపులర్ అవుతుందో.బాలయ్య హోస్ట్ చేస్తున్నాడంటే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ టాక్ షో చూడటానికి బాలయ్య అభిమానులే కాకుండా ఇతర ప్రేక్షకులు కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అస్సలు బాలయ్య వాక్దాటికి టీ ఆర్ పి రేటింగ్స్ పెరిగి పోతాయని బాలయ్య అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు. ఇప్పటికే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ హోస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి బాలయ్య కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: