అక్కినేని
నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రంను
సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా ఎంతో మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా చేయడం తో దీనివల్ల
సినిమా పరిశ్రమ
థియేటర్ పరిశ్రమ మళ్లీ పుంజుకుందని చెప్పవచ్చు. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ
సినిమా రెండు మూడు సార్లు విడుదల పోస్ట్ పోన్ అయ్యింది.
దాంతో
సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడగా వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ
సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ
సినిమా పూర్తయిన వెంటనే అక్కినేని
నాగచైతన్య తన తదుపరి చిత్రాలను మొదలుపెట్టి షూటింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన బాలీవుడ్లో ఎంట్రీ చేయాలని చెప్పి
అమీర్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో నటించడం మొదలు పెట్టాడు.
ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ఈ విధమైన ప్రయోగం చేశాడు
నాగ చైతన్య.
అందుకే ఆ
సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాలు పాన్
ఇండియా సినిమాలు చేయాలని
చైతన్య భావిస్తున్నాడు. ఇక తెలుగులో ఆయన హీరోగా
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రం తెరకెక్కుతుంది. రాషిఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ
సినిమా విక్రమ్ కుమార్ స్టైల్ లో ఎంతో వెరైటీగా వినూత్నంగా తెరకెక్కబోతుందట. ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. అందరూ
లవ్ స్టోరీ హ్యాంగోవర్ లో ఉండగానే ఈ సినిమాను
డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాగచైతన్య. మరి
లవ్ స్టోరీ లాగానే ఈ
సినిమా కూడా సూపర్ హిట్ సాధిస్తుందా అనేది చూడాలి.