అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రంను సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా చేయడం తో దీనివల్ల సినిమా పరిశ్రమ థియేటర్ పరిశ్రమ మళ్లీ పుంజుకుందని చెప్పవచ్చు. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రెండు మూడు సార్లు విడుదల పోస్ట్ పోన్ అయ్యింది.

దాంతో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడగా వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రాలను మొదలుపెట్టి షూటింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన బాలీవుడ్లో ఎంట్రీ చేయాలని చెప్పి అమీర్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో నటించడం మొదలు పెట్టాడు. ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ఈ విధమైన ప్రయోగం చేశాడు నాగ చైతన్య.

అందుకే ఆ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేయాలని చైతన్య భావిస్తున్నాడు. ఇక తెలుగులో ఆయన హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రం తెరకెక్కుతుంది. రాషిఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా విక్రమ్ కుమార్ స్టైల్ లో ఎంతో వెరైటీగా వినూత్నంగా తెరకెక్కబోతుందట. ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. అందరూ లవ్ స్టోరీ హ్యాంగోవర్ లో ఉండగానే ఈ సినిమాను డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాగచైతన్య. మరి లవ్ స్టోరీ లాగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాధిస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: