మా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. దుర్భాషలాడారని ఆరోపించారు. తాము ఎవరికీ అడ్డుపడమని, స్వచ్ఛగా పని చేసుకోవాలని సూచించారు. నిన్న ప్రకాశ్రాజ్ వర్గం చేసిన ఆరోపణలకు ఈరోజు నటుడు నరేష్ కౌంటర్ ఇచ్చాడు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మగవారు ఎవ్వరూ ఏడ్వరు అని.. ఏడిచిన వారి ఏడుపును అస్సలు నమ్మకూడదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్.
మంచు విష్ణు హీరో, నేను హీరో, మోహన్పెద్ద హీరో అందుకే మా చుట్టు తిరుగుతున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్లు పడుతాయి. నన్ను చూస్తే ప్రకాశ్రాజ్కు ఏమనిపిస్థుందో అర్థం కావడం లేదు. నేను తప్పును జరగనివ్వనని పెద్ద భయం. విష్ణు చక్రాన్ని ప్యాంట్ పెట్టుకుంటే ప్యాంట్ చిరిగిపోతుంది. మా అనేది ఒక సేవా సంస్థ, దానికి రిజైన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అందరం కలిసి మెలిసి కలిసి కట్టుగా పని చేద్దాం రండి అని పిలిచారు. ఇప్పటివరకు ఎన్నికలు జరిగాక ఎప్పుడు ఈ విధంగా ఆరోపణలు జరుగలేదు. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. అతిగా ఏడ్చే మగవాళ్లను.. అతిగా నవ్వే ఆడవాళ్లను అస్సలు నమ్మవద్దనే సామెత ఇందుకు సరైన ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. మాలో పెత్తనందారి వ్యవస్థ పోవాలి. ఏమి ప్రశ్నిస్తారో ప్రశ్నించండి. మా లో అసలు ఎన్నికలే ఉండకూడదు. ఇకనుంచి అన్ని ఏకగ్రీవాలే జరగాలి అని నరేష్ పేర్కొన్నారు. ఎన్నికల కేంద్రంలో సీసీ కెమెరాలున్నాయి. మోహన్బాబు బూతులు తిడితే అందులో రికార్డు అవుతాయి. సాక్షాలు చూపించండి. అని ఎదురుప్రశ్న వేశారు. వాళ్లే మా వాళ్లను కొరికారు. రెచ్చగొట్టారు. ఆ విధమైన సంస్కారం మాకు లేదన్నారు నరేష్.