కెరియర్ తొలినాళ్ళలో ఆశించిన ఫలితాలు రాక కాస్త తడబడ్డ పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. "అల వైకుంఠపురంలో" చిత్రంతో మిలియన్ల కొద్దీ అభిమానులను తన బుట్టలో వేసేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ గా రాణిస్తూ తన సత్తా చాటుతున్న పూజా హెగ్డే కి ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ ఈమె దూకుడు మామూలుగా ఉండదు.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ ను సోషల్ మీడియా వేదికపై పంచుకుంటూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది ఈ భామ. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అయినప్పటికీ తనకి కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి.

అదే విధంగా పూజా హెగ్డే కి కూడా కొన్ని ఇష్టమైన విషయాలు ఉన్నాయి. ఈ ముంబై భామకి హీరోలలో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అట. ఓ ఇంటర్వ్యూ లో ఈమె విషయాన్ని తెలియచేసింది. అలాగే ప్రొడ్యూసర్ లలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ అంటే కూడా చాలా ఇష్టమని ఓ స్టేజ్ పై చెప్పారు పూజ. అంతేకాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ కి వెళ్తున్న సమయంలో సడెన్ గా నిర్మాత అల్లు అరవింద్ నుండి మెసేజ్ రావడం తో షాక్ అయిందట పూజ. అందులో ఏముందంటే, సినిమాలో ఎంతో బాగా నటించావు అంటూ తన అభిమాన నిర్మాత తనకి మెసేజ్ చేయడం తో చాలా సంతోషించారట పూజ.

ఇదంతా తాజాగా జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చెప్పుకొచ్చారు పూజ. ఇక ఈమె తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  ఇది కాకుండా రాధేశ్యామ్ మూవీలో కూడా పూజ హెగ్డే నటిచింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: