నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన "ఒక లైలా కోసం" సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యింది పూజ హెగ్డే. ఆ తర్వాత నాగబాబు తనయుడు మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా పరిచయమయిన తొలి చిత్రం "ముకుంద" సినిమాలో హీరోయిన్ గా చేసి గోపికమ్మ పాటతో బాగా హైలెట్ అయ్యింది. మొదట్లో పెద్దగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథ్ చిత్రంలో ఫుల్ గ్లామరస్ గా కనిపించి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని క్రేజ్ ను పెంచుకుంది. ప్రస్తుతం వరుస విజయాలతో అగ్ర హీరోలకు బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ గా నిలచి దూసుకుపోతోంది ఈ భామ. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ పారితోషకం పుచ్చుకుంటున్న స్టార్ హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు.

ఇటీవలే త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న "అల వైకుంఠపురం లో" సినిమాలో  అల్లు అర్జున్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం  అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లో హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.  సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో అదరగొడుతోంది చిత్ర బృందం.  ఈ సినిమా అక్టోబర్ 15 న దసరా బరిలోకి దిగేందుకు రెడీ అయిపోగా..విడుదలకు ముందే పూజకు మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు. అటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈసారి అఖిల్ ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతారనే అంటున్నారు.

ఇదిలా ఉండగా పూజ హెగ్డే అప్ కమింగ్ చిత్రాల విషయానికొస్తే, ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "రాధేశ్యామ్"  షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 14 న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుందని ఇటీవల అనౌన్స్ చేశారు మేకర్స్. అంతే కాకుండా ఆచార్య సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో అగ్ర హీరో తలపతి విజయ్ సరసన ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. బాలీవుడ్  లో "సర్కస్" అనే చిత్రం లో హీరోయిన్ గా చేస్తోంది పూజ. "కబీ ఈద్ కబీ దివాలి" సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలోనూ నటిస్తోంది.  అలాగే హౌస్ ఫుల్ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా చేస్తోంది పూజ హెగ్డే. ఇలా తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా దూకుడు చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: